Advertisement

  • కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి... పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ?

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి... పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ?

By: Anji Thu, 27 Aug 2020 7:11 PM

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి... పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ?

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి... పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పురుషులకంటే సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. మహిళల్లో ఉండే ‘టి’ కణాలు బలంగా ఉండటం వల్లే... ఈ టి కణాన్ని టి లింఫోసైట్ అని కూడా పిలుస్తారు. ఇవి ఒకరకమైన తెల్లరక్తకణాలు అని అంటారు. అయితే మనుషుల్లోని రోగనిరోధక శక్తిని నిర్ణయించేవి ఇవే.


పురుషులతో పోల్చుకుంటే... ఈ టి సెల్స్ మహిళల్లోనే శక్తివంతంగా ఉంటాయని, ఈ క్రమంలోనే… కోవిడ్ 19 ని ఎదుర్కొనే శక్తి మహిళల్లోనే అధికంగా ఉంటోందని ఓ అధ్యయనం చెబుతోంది. టి కణాలు బలంగా ఉన్న వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

‘నేచర్’ పత్రికలో ఈ వివరాలను ప్రచురించారు. అమెరికాలోని యేల్ న్యూ హెవెన్ ఆసుపత్రిలో పద్ధెనిమిదేళ్ళ వయస్సు పైబడిన 87 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోవిడ్ 19 తీవ్రత మగవారిలోనే ఎక్కువగా ఉంటోందని ఇంతకుముందు కూడా పరిశోధనలు వెల్లడించినా అందుకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు.

ఇప్పుడు మాత్రం స్పష్టత వచ్చింది. టీ కణాలు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కు గురైన కణాలను చంపటంలో కూడా వీటిదే ప్రధాన బాధ్యత. టి సెల్స్ సరిగ్గా స్పందించలేకపోవటం వల్ల పురుషులలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పెద్ద వయసున్న పురుషులు కోవిడ్ కు గురయినప్పుడు టి కణాల స్పందన మరీ తక్కువగా ఉంటోంది. అయితే... మహిళల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. కాగా... కరోనాను ఎదుర్కొనే క్రమంలో... తాజా ఫలితాలు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు.

Tags :

Advertisement