Advertisement

  • హ‌త్య కేసును చేధించిన పోలీసులు...అక్ర‌మ సంబంధ‌మే కారణం...

హ‌త్య కేసును చేధించిన పోలీసులు...అక్ర‌మ సంబంధ‌మే కారణం...

By: chandrasekar Wed, 04 Nov 2020 6:56 PM

హ‌త్య కేసును చేధించిన పోలీసులు...అక్ర‌మ సంబంధ‌మే కారణం...


నిజామాబాద్ జిల్లాలో అక్టోబ‌రు 27వ తేదీన మొగుపాల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి శివారులోని మంచిప్ప వ‌ద్ద పోలీసులు బ్యాగులో ఓ మృతదేహాన్ని క‌నుగొన్నారు. మృతుడిని జ‌వ్వాజీ నారాయ‌ణ‌(41)గా గుర్తించారు. హ‌త్య ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టి విజ‌య‌వంతంగా ముగించారు.

మృతుడి భార్య‌తో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ శ్రీ‌నివాస్ ప్ర‌సాద్ వివ‌రాల‌ను ప్రకటించారు. న‌వీపేట మండ‌ల కేంద్రానికి చెందిన నారాయ‌ణ నిజామాబాద్‌లోని సాయిప్రియా న‌గ‌ర్‌లో నివ‌సిస్తున్నాడు. భార్య శిరిషా, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కాగా శిరిషా పోస్టు గ్రాడ్యుయేట్ చ‌దివే సోరుపాక ఫ‌నీంద్ర ప్ర‌సాద్ అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌రుచుకుంది.

విష‌యం తెలిసిన భ‌ర్త ప‌లుమార్లు భార్య‌ను హెచ్చ‌రించాడు. దీనిపై ఫ‌నీంద్ర‌తో శిరిషా చ‌ర్చించింది. నారాయ‌ణ అడ్డు తొల‌గించుకునేందుకు ఇరువురు ప‌థ‌కం పన్నారు. అక్టోబ‌ర్ 26న మ‌ధ్యాహ్నం నారాయ‌ణ ఇంట్లో నిద్ర‌పోతుండ‌గా ఫ‌నీంద్ర‌, శిరిషా క‌లిసి ప‌డుకున్న వ్య‌క్తి గొంతుకోశారు. ఆన‌క ప‌లుమార్లు పొడిచి చంపారు.

అనంత‌రం త‌న సోద‌రుడు మ‌హేంద్ర ప్ర‌సాద్‌తో క‌లిసి ఫ‌నీంద్ర మృత‌దేహాన్ని బ్యాగులో ప్యాక్ చేసి మంచిప్ప ప్రాంతంలో ప‌డేశాడు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును విజ‌య‌వంతంగా చేధించిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Tags :

Advertisement