వైసీపీ నాయకుల జేబు కొట్టేసిన దొంగలు
By: chandrasekar Mon, 02 Nov 2020 09:40 AM
మంత్రి పర్యటనలో దొంగలు
చాలా మంది నాయకుల జేబు కొట్టేసిన సంగటక ఒకటి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల
శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సొంత జిల్లా నెల్లూరులో పాల్గొన్న ఓ
కార్యక్రమంలో జేబు దొంగలు రెచ్చిపోయారు. రెండ్రోజుల క్రితం నెల్లూరు నగరంలోని ఏఎస్
పేట దర్గాను మంత్రి మేకపాటి సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు
ఉన్నతాధికారులు, నాయకులతో సైతం మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి
పర్యటన సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నాయకులూ
భారీగా కలుసుకోవడంతో దీన్ని అదనుగా చేసుకున్న జేబు దొంగలు తమ చేతివాటం
ప్రదర్శించారు. పలువురు వైసీపీ కార్యకర్తల జేబులు కత్తిరించారు. ఈ సందర్భంగా
దాదాపు రూ. లక్షకు పైగా దొంగలు డబ్బు కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో
బాధితులు స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న
పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి
ఉంది.