Advertisement

  • పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్యాయత్నం సందిగ్ధంలో తల్లి దండ్రులు

పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్యాయత్నం సందిగ్ధంలో తల్లి దండ్రులు

By: chandrasekar Sat, 22 Aug 2020 7:10 PM

పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్యాయత్నం సందిగ్ధంలో తల్లి దండ్రులు


పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో వాళ్ళ తల్లి దండ్రులు సందిగ్ధంలో మునిగారు. ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి గంట ముందు పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలంరేపింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉన్నాడు. దర్శి మండలం దేవవరంకు చెందిన మరేష్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.

వరుడికి మర్రిపూడి మండలం గుండ్ల సముద్రంకు చెందిన యువతితో వివాహ నిశ్చయమైంది. శుక్రవారం ముహూర్తం కాగా పెళ్లికి గంట ముందు అతడు బాత్రూమ్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. వరుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అతడ్ని హుటా హుటిన మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.

పెళ్లి జరగాల్సిని సమయంలో అతడు ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించాడో వివరాలు తెలియాల్సివుంది. పెళ్లి ఇష్టం లేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడా లేకుంటే మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. వరుడు ఇలా పెళ్లికి గంట ముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తరపు బంధువులు కూడా ఆందోళనలో ఉన్నారు. కారణం తెలియక పోవడంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు.

Tags :
|

Advertisement