పాక్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ కు బయలుదేరింది
By: chandrasekar Tue, 30 June 2020 10:48 AM
ప్రపంచవ్యాప్తంగా పట్టి
పీడిస్తోన్న కరోనా కారణంగా అన్నిరంగాలలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. క్రిడారంగంలో కూడా ఏర్పడ్డ మార్పులవలన జరుగవలసిన క్రీడలు
అన్ని ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.
కరోనా కారణంగా రెండు నెలల
పాటు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లో క్రికెట్ టోర్నీలు స్తంభించిపోయాయి. కరోనా
వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇంగ్లీష్ జట్టుతో సిరీస్లో పాల్గొనేందుకు ఇప్పటికే
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్లో అడుగుపెట్టింది.
క్వారంటైన్ పూర్తైన తర్వాత కరీబియన్ టీమ్ టెస్టు సిరీస్ కోసం
సన్నద్ధమవుతోంది. ఇంగ్లాండ్లో పర్యటించాలని
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా
ఆదివారం పాక్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరింది. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు
పాక్ ఆటగాళ్లందరికీ స్వదేశంలోనే కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల్లో నెగెటివ్గా
తేలిన వారిని ఇంగ్లాండ్ వెళ్లేందుకు
అనుమతించారు. 20 మంది సభ్యుల బృందం ఇంగ్లాండ్లోని వోర్సెస్టర్లో 14 రోజుల
పాటు క్వారంటైన్లో ఉంటుంది.
ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో ఇంగ్లాండ్తో మూడు టెస్టులు, మూడు
టీ20ల
సిరీస్లో పాక్ ఆడనుంది.