Advertisement

  • తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా...కోవిడ్ బాధితుల సంఖ్య 58,906

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా...కోవిడ్ బాధితుల సంఖ్య 58,906

By: chandrasekar Wed, 29 July 2020 11:47 AM

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా...కోవిడ్ బాధితుల సంఖ్య 58,906


తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే తెలంగాణలో 1764 కరోనా కేసులు నమోదయ్యాయి. పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటకలతో పోలిస్తే తక్కువగా నమోదవుతున్నా జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 58,906కు చేరింది. సోమవారం 842 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకూ 43,751 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో రికవరీ రేటు 74.3 శాతం దాటింది. సోమవారం తెలంగాణలో 18,858 శాంపిళ్లను పరీక్షించగా 1764 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలగా మరో 788 శాంపిళ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 24 గంటల్లో కరోనా బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 492కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.84 శాతంగా ఉంది. జాతీయ సగటు 2.26 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ.

ఇతర అనారోగ్య సమస్యలు ఉండి కరోనా సోకి చనిపోయిన వారిని కరోనా మరణాల జాబితాలో చేర్చడం లేదని ఆరోగ్య మంత్రి ఈటల తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 509 కరోనా కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 158, రంగారెడ్డి జిల్లాలో 147, వరంగల్ అర్బన్ జిల్లాలో 138, కరీంనగర్ జిల్లాలో 93, సంగారెడ్డి జిల్లాలో 89, ఖమ్మం జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 51, నిజామాబాద్ జిల్లాలో 47, పెద్దపల్లి జిల్లాలో 44, వరంగల్ రూరల్ 41 కేసుల చొప్పున నమోదయ్యాయి

Tags :

Advertisement