తెలంగాణ రాష్ట్రంలో 42,496కు చేరిన కరోనా కేసుల సంఖ్య
By: chandrasekar Sat, 18 July 2020 10:54 AM
కరోనా కేసులు తెలంగాణలో
శుక్రవారం మొత్తం 1478 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్లో
పేర్కొన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,496కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 13,389గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1410 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటి వరకూ పూర్తిగా
కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 28,705 కు చేరింది. ఇక శుక్రవారం మరో 7 మంది
కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 403కి
చేరింది. శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున
కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 806 కొత్త
కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా
రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 91 కొత్త కేసులు నమోదయ్యాయి.
మేడ్చల్ జిల్లాలో 82 కొత్త
కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో శుక్రవారం కరీంనగర్ జిల్లా
ఉంది. ఇక్కడ 77 కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తెలంగాణలో
శుక్రవారం ఒక్కరోజే 15,124 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1478
కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య
2,37,817కు చేరింది. టెస్ట్ చేసిన శాంపిల్స్లో పాజిటివ్గా తేలుతున్న శాతం 18గా
ఉంది.