ఏపీలో కరోనా కేసుల సంఖ్య గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 555 కేసులుగా నమోదు
By: chandrasekar Mon, 03 Aug 2020 09:37 AM
కట్టడి చెయ్యడానికి
వీలుకాకుండా గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 555
కేసులు ఏపీ లో నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య మరింతగా
పెరుగుతుంది. కొత్తగా 8 వేల 555 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షన్నర
దాటింది. గత రెండ్రోజులతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటం ఊరట కల్గిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల కొనసాగుతోంది.
తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ కరోనా బుల్లెటిన్ విడుదల చేసింది. గత 24
గంటల్లో కొత్తగా 8 వేల 555 కేసులు నమోదయ్యాయి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసికొని
అవసమైతేనే బయటకు వెళ్లాలని ప్రభుత్వం అనేక సార్లు సూచనలు చేస్తున్నాయి.
దేశంలోనే ఏపీ ప్రభుత్వం
మరోవైపు రికార్డు స్థాయిలో గత 24 గంటల్లోనే 52 వేల 834 కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని నిర్వహించింది. దీంతో 20 లక్షల
65 వేల 407
పరీక్షలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఏపీలో మొత్తం లక్షా 58 వేల 764
కేసులకు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి
సంఖ్య 6 వేల 272కు
చేరుకుంది. ఇప్పటివరకూ మొత్తం 82 వేల 886 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత వారంకంటే కొత్త కేసులు
సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్రంలో గత రెండు మూడు
రోజుల్నించి పోలిస్తే గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల
కన్పించడం ఊరట కల్గించే పరిణామంగా ఉంది. ఇక కరోనా కారణంగా గత 24
గంటల్లో 67 మంది
మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 1474కు
చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 74 వేల 404 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రజలందరూ సామజిక
దూరాన్ని పాటిస్తూ ముఖానికి మాస్కులు తొడగాలని ప్రభుత్వం అనేక మార్లు సూచనలు
చేస్తూవుంది. దీనిని అందరూ గుర్తించి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాల్సివుంది.