Advertisement

కన్నకూతురిని కిడ్నాప్ చేసిన తల్లి

By: chandrasekar Tue, 15 Dec 2020 4:14 PM

కన్నకూతురిని కిడ్నాప్ చేసిన తల్లి


తూర్పుగోదావరి జిల్లాలో 13 ఏళ్ల బాలిక సంయుక్త కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లే కూతురిని కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు కనుగొన్నారు. విజయవాడలోని ఓ లాడ్జిలో బాలిక ఉన్నట్లు గుర్తించి ఆమె తల్లిని, మేనమామని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ గొడవల కారణంగానే కిడ్నాప్ చేసినట్లు సమాచారం. తల్లిదండ్రులు వేరుగా ఉంటుండడంతో కూతురు తండ్రి వద్ద ఉంటానని చెప్పినకారణంగా తాతయ్య ఇంటి వద్ద ఉన్న బాలికను తల్లి, ఆమె సోదరుడు బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం.

అమలాపురం పరిధిలోని అయినవిల్లి మండలంకు చెందిన రవితేజ, వెంకటలక్ష్మి భార్యాభర్తలు. వారికి కూతురు సంయుక్త, కొడుకు మనోజ్ ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా భార్యాభర్తలు హైదరాబాద్‌లో విడివిడిగా ఉంటున్నారు. పెద్దమనుషుల రాజీ చర్చల్లో కూతురు సంయుక్త తండ్రి వద్ద ఉంటానని చెప్పడంతో ఆయనతో పంపించారు. అయితే తన కూతురిని పంపించాలని వెంకటలక్ష్మి ఎలాగైన కూతురిని తెచ్చుకోవాలని కిడ్నాప్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన సోదరుడితో కలసి కారులో శానపల్లిలంకకు వచ్చి సంయుక్తని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం. నల్లరంగు కారులో వచ్చిన దుండగులు బాలికను తీసుకెళ్లినట్లు చెప్పడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టగ బాలిక విజయవాడలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు లాడ్జికి వెళ్లి బాలికను రక్షించి ఆమె తల్లిని, మేనమామని అదుపులోకి తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement