ఎమ్మెల్యే పరమేశ్వర్ నాయక్ కొడుకు పెళ్లికి 800 మంది
By: chandrasekar Wed, 17 June 2020 11:28 AM
ఒక పక్క కేరళ సీఎం కూతురు
పెళ్లి సాదాసీదాగా జరిగితే కర్నాటకలో హూవినహడగలి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ
మంత్రి పరమేశ్వర్ నాయక్ కొడుకు పెళ్లి
మాత్రం బళ్లారి జిల్లా లక్ష్మిపురలో వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలు అమలులో
ఉండటంతో 50
మందికి మించకుండా పెళ్లి చేసుకుంటామని పర్మిషన్ తీసుకొని రూల్స్ బ్రేక్ చేశారు.
ఈ పెళ్లికి కర్ణాటక
హెల్త్ మినిస్టర్ బి. శ్రీరాములు తో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ
డిప్యూటీ సీఎం పరమేశ్వర లాంటి పెద్ద లీడర్లు హాజరయ్యారు. వీరు కనీసం మాస్క్ లు
కూడా పెట్టుకోలేదు.
ఫిజికల్ డిస్టెన్స్ ను
పాటించలేదు. హెల్త్ మినిస్టర్ గా ఉండి కనీసం మాస్క్ కూడా కట్టుకోని శ్రీరాములు
వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పైగా పెళ్లికి 800
మందికి పైగా వచ్చారు. వీరి కోసం బళ్లారిలోని లక్ష్మిపురలో పెద్దఎత్తున టెంట్
ఏర్పాటు చేశారు.
పెళ్లికి వచ్చిన వారిలో
సగం మందికి పైగా మాస్క్ లు పెట్టుకోలేదు. ఆడంబరంగా జరిగిన ఈ పెళ్లి వీడియోలు సోషల్
మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రూల్స్ పాటించని
వారిపై చర్యలు తీసుకుంటామని బళ్లారి కలెక్టర్ ఎస్. ఎస్ నకుల్ చెప్పారు. పెళ్లి
కొడుకు, ఎమ్మెల్యే
పరమేశ్వర్ నాయక్ మాత్రం ఈ విషయాన్ని హైప్ చేయవద్దని మీడియాను కోరటం హైలైట్.