Advertisement

మాన్సాన్ ట్రస్ట్ విషయం మరో కీలక మలుపు

By: chandrasekar Tue, 16 June 2020 4:34 PM

మాన్సాన్ ట్రస్ట్ విషయం మరో కీలక మలుపు


తెరపైకి పూసపాటి ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతిరాజు, కుమార్తె ఊర్మిళా గజపతిరాజు వచ్చారు. తాము ఆనంద గజపతి నిజమైన వారసులమంటూ సంచలన ప్రకటన చేశారు. 1991లోనే ఆనందగజపతిరాజు నుంచి సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విడాకులు తీసుకున్నారని చెబుతున్నారు. ఆస్తుల పంపకాలూ పూర్తయ్యాయని తమ దగ్గర కూడా ఆధారాలూ ఉన్నాయన్నారు. తన తండ్రి స్వహస్తాలతో రాసిన వీలునామా ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఆస్తులు తమకే చెందుతాయని ఊర్మిళా గజపతిరాజు అంటున్నారు.

ఇక సంచయితకు సంబంధించి ఆస్తులను ఆమెకు వివాహం కాకముందు విక్రయించకూడదని పత్రాల్లో స్పష్టంగా రాసి ఉందంటున్నారు వీరి తరపు లాయర్. ఆమె ఆస్తుల్ని అమ్మడం చట్ట విరుద్దమంటున్నారు. సంచయిత ఆనంద గజపతిరాజు వారసురాలిగా ఒక్క ఆధారాన్నైనా చూపించాలని వారసత్వ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామని ఊర్మిళ, సుధ చెబుతున్నారు.

గతేడాది మేలో చెన్నైలో ఓ ఆస్తి విషయమై సంతకాలు ఫోర్జరీ చేశామంటూ సంచయిత విశాఖ 3 టౌన్పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడంతో తమకు నోటీసులొచ్చాయని అందుకే లండన్‌ నుంచి ఇక్కడికి వచ్చామని ఊర్మిళ అంటున్నారు. చెన్నైలో జరిగిన విషయాన్ని విశాఖలో జరిగినట్లు చెప్పి ఫిర్యాదు చేశారన్నారు.

Tags :
|
|

Advertisement