ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించే బిల్లును ఆమోదించిన లోక్ సభ
By: chandrasekar Wed, 16 Sept 2020 10:26 AM
ఎంపీల జీతాల్లో 30 శాతం
కోత విధించే బిల్లును లోక్ సభ
ఆమోదించింది. దేశంలో ఆర్ధిక స్థితి మరింత దిగజారింది. చాలా మంది
నిరుద్యోగులయ్యారు మరియు ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు. కొందరికయితే జీతాల్లో
కొత్త విధించారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ కంపెనీలకే పరిమితమైన జీతాల
కోత ఇప్పుడు పార్లమెంట్ కు సైతం వర్తించింది. ఎంపీల జీతాల్లో 30 శాతం
కోత విధించే బిల్లును లోక్ సభ ఆమోదించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా
ప్రజానీకంతో సహా దేశం మొత్తం ఆర్ధిక ఇబ్బందులతో తల్లడిల్లుతోంది. కొన్ని కంపెనీలు
ఉద్యోగుల్ని తొలగించగా మరి కొన్ని కంపెనీలు నో వర్క్ నో పే విధానాన్ని
అనుసరిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు మాత్రం జీతాల్లో కోత విధించాయి.
ఎంపీలకు అందిస్తున్న
జీతాలతో కొత్త విధించడానికి బిల్లును ఇప్పుడు లోక్ సభలో ఆమోదించింది. ఈ జీతాల కోత
పార్లమెంట్ ఎంపీలకు కూడా వర్తిస్తోంది. ఏడాది పాటు ఎంపీల జీతంలో 30 శాతం
కోత విధించనున్నారు. దీనికి సంబంధించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కరోనా
వైరస్ పై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంలో ఈ బిల్లును రూపొందించారు.
కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది. పార్లమెంటు సభ్యుల
జీతం, భత్యాలు, పెన్షన్
(సవరణ) బిల్లు, 2020గా ఈ బిల్లు ఉంది.
దేశంలో కరోనా తీవ్రత వల్ల
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు
స్వచ్ఛందంగా వేతనాల కోతకు ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఈ మొత్తం నిధులన్నీ సంఘటిత
నిధికి జమకానున్నాయి. మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఎంపీ
ల్యాడ్స్ నిధుల్ని ఇప్పటికే రద్దు చేశారు.
దేశంలో ఇప్పటి వరకు 49,33,188 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో
9,92,850 యాక్టివ్ కేసులున్నాయి. 38,58,815 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే మన దేశంలో
తక్కువ శాతం మరణాలుగా నమోదయ్యాయి.