జపాన్ ప్రభుత్వం కరోనావైరస్ వ్యాక్సిన్ ను పౌరులందరికీ ఉచితంగా అందించే ఆలోచనలో
By: chandrasekar Thu, 03 Sept 2020 09:40 AM
కరోనా ప్రపంచ వ్యాప్తంగా చాల వేగంగా ప్రబలుతున్న ఈ సమయంలో వాక్సిన్ కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. జపాన్ ప్రభుత్వం కరోనావైరస్ వ్యాక్సిన్ను పౌరులందరికీ ఉచితంగా అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ ఎప్పడు వచ్చినా తాము ఉచితంగా కరోనావైరస్ వ్యాక్సిన్లను ప్రజలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్ కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ దేశంలో నమోదైంది. ఇదిలా ఉండగా చైనా ఔషధ దిగ్గజం సినోఫార్మ్ ఆగస్టులో బహ్రెయిన్లో కరోనా వ్యాక్సిన్ను పరీక్షించడం ప్రారంభించింది.
ఈ వాక్సిన్ ను సుమారు
6,000 మందిపై పరీక్షించినట్లు పరిశోధకులు తెలియజేశారు. టీకా సామర్థం, భద్రతను పరీక్షించడానికి ఆరోగ్యకరమైన పురుషులు, మహిళలను వలంటీర్లుగా నియమిస్తోంది. ఈ వ్యాక్సిన్ పూర్తిస్థాయి పరిశీలిన వచ్చే ఏడాది జూలైలో పూర్తి కానున్నట్లు సమాచారం. మొత్తం అధ్యయనం సెప్టెంబర్ 2021 నాటికి పూర్తవుతుందని యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపింది. ఏఎఫ్పీ లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా వ్యాక్సిన్లను ప్రస్తుతం మానవులపై పరీక్షిస్తున్నారు. చాలా వరకు వాక్సిన్ లు రెండు మరియు మూడవ దశలలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కోనైతే చివరి దశలో ఉన్నట్లు తెలుపుతున్నాయి. అన్ని దశలను పూర్తి చేసిన తరువాతే ఆరోగ్య సమస్థ ఆ వాక్సిన్ ను గుర్తించబోనున్నట్లు తెలిపింది.
వివిధ మోతాదులపై వాక్సిన్ ను పరీక్షించాల్సి వుంది. రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత మంది రోగులు వైరస్ బారిన పడ్డారో బహ్రెయిన్ పరిశోధకులు పరిశీలిస్తున్నారు. పరీక్షలు పూర్తి చేయకుండా కరోనావైరస్ వ్యాక్సిన్ను ఆమోదించలేమని యూఎస్ ఆరోగ్య అధికారి ఒకరు చెప్పిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యక్తం చేసిన ఆందోళనలపై వైట్ హౌస్ మంగళవారం స్పందించింది. ఈ వైరస్ను ఓడించడానికి యునైటెడ్ స్టేట్స్ మా అంతర్జాతీయ భాగస్వాములను నిమగ్నం చేస్తూనే ఉంటుంది. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా ప్రభావిత బహుళపక్ష సంస్థలు దీన్ని అడ్డుకుంటున్నాయని వైట్ హౌస్ ప్రతినిధి జుడ్ డీర్ ఒక ప్రకటనలో తెలిపారు.