అత్యధిక ఫాన్స్ కలిగిన ఐపీఎల్ టీం...
By: chandrasekar Thu, 26 Nov 2020 11:33 AM
ముగిసిన ఐపీఎల్ 2020
సీజన్లో అత్యధిక అభిమానులు కలిగిన సర్వేలో మొదటి మూడు స్థానాలు పొందిన జట్లను
గుర్తించారు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై
సూపర్ కింగ్స్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టుకు ఎంతో మంది
వీరాభిమానులున్నారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై మూడుసార్లు టైటిల్ సాధించగా, ఈ
ఏడాది మినహా ప్రతీ సీజన్లోనూ ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఐపీఎల్లో అత్యధిక సంఖ్యలో
అభిమానులున్న ఫ్రాంఛైజీగా చెన్నై అరుదైన రికార్డు సృష్టించింది. మీడియా
కన్సల్టింగ్ సంస్థ ఓర్మ్యాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఐపీఎల్ 2020 సీజన్
జరిగిన ఎనిమిది వారాల్లో దేశవ్యాప్తంగా 23
రాష్ట్రాల్లో సర్వే చేసి సమాచారాన్ని క్రోడీకరించారు.
ఇందుకోసం ఐపీఎల్లోని
ఎనిమిది ఫ్రాంఛైజీలకు కలిపి మొత్తం 86 మిలియన్లు(8.6కోట్లు) మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక ఫ్రాంఛైజీ
అభిమాని మొదటి మ్యాచ్ నుంచి ఆఖరి మ్యాచ్
వరకు తన అభిమాన టీమ్/ఆటగాళ్ల గురించి ఆన్లైన్/ఆఫ్లైన్లో చర్చించినట్లు ఈ
అధ్యయనంలో గుర్తించారు. చెన్నై టీమ్ అత్యధికంగా 26.8 మిలియన్ల అభిమానులతో
అతిపెద్ద ఫ్యాన్బేస్ కలిగిన జట్టుగా నిలిచింది.
ఆ తర్వాతి స్థానంలో 2020 సీజన్ విజేత ముంబై ఇండియన్స్ 24.8
మిలియన్లు, రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు 13.3 మిలియన్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఈ మూడు ఫ్రాంచైజీలు మొత్తం అభిమానుల సంఖ్యలో 75% వాటా కలిగివుండగా, మిగిలిన ఐదు ఫ్రాంచైజీలు
కలిపి 25శాతం
వాటాతో సరిపెట్టుకున్నాయి. మొత్తం
ఫ్రాంఛైజీ అభిమానుల్లో 64శాతం మంది పురుషులు కాగా 36 శాతం
మంది మహిళలున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. కానీ ఎప్పుడు కూడా చెన్నై సూపర్ కింగ్స్
కె అదికంగా అభిమానులు సపోర్ట్ చేస్తారన్న విషయం మనకు తెలిసిందే.