Advertisement

  • ఐపిఎల్ 2020 ఫైనల్ ఫేవరెట్ ఆ టీమ్ మే అన్న బ్రెట్‌లీ

ఐపిఎల్ 2020 ఫైనల్ ఫేవరెట్ ఆ టీమ్ మే అన్న బ్రెట్‌లీ

By: chandrasekar Sat, 19 Sept 2020 09:44 AM

ఐపిఎల్ 2020 ఫైనల్ ఫేవరెట్ ఆ టీమ్ మే అన్న బ్రెట్‌లీ


IPL 2020 గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) శనివారం నుంచి ప్రారంభంకానుంది. తొలి రోజు అబు దాబిలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్ 2020 ఛాంపియన్‌గా ఏ జట్టు నిలవనుందో ఆస్ట్రేలియా దిగ్గజ ఫేసర్ బ్రెట్‌లీ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సారి కూడా ట్రోఫీ దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని జోస్యం చెప్పాడు.

తాను సీఎస్కే వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నదీ విశ్లేషించాడు. స్పిన్ విభాగంలో సీఎస్కే పటిష్టంగా ఉండటం టోర్నీలో ఆ జట్టుకు ప్లస్ పాయింట్ అవుతుందని విశ్లేషించాడు. యూఏఈ వేదికలు స్పిన్ బౌలర్లకు కలిసి వస్తాయని గుర్తుచేశాడు. స్పిన్ అటాక్ కారణంగా సీఎస్కే ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలుస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. సీఎస్కే జట్టులో సురేశ్ రైనా, హర్భజన్, మలింగా వంటి సీనియర్లు లేకున్నా సీఎస్కే మిగిలిన జట్ల కంటే బలంగానే ఉందని బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు.

మలింగా లేని లోటును బుమ్రా భర్తీ చేస్తాడని ధీమా వ్యక్తంచేశాడు. బుమ్రాకు తాను ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చిన బ్రెట్‌లీ రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రాకు ఉందని మెచ్చుకున్నాడు. మ్యాచ్ చివరి ఓవర్లలో మంచి బౌలింగ్ చేయగల సామర్థ్యం బుమ్రాకు ఉందన్నాడు. అటు మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదని బ్రెట్‌లీ అన్నాడు. మరి ఈసారి ఎవరు కప్పు గెలుస్తారో వేచి చూస్తాం.

Tags :
|
|

Advertisement