అమెజాన్ గోదాంలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులే ఐఫోన్ల దొంగతనం చేసారు...
By: chandrasekar Tue, 22 Dec 2020 2:07 PM
కరోనా దృష్టిలో ఉంచుకొని
భద్రతా తనిఖీలను నిలిపివేయడాన్ని ఆసరాగా తీసుకున్న ఇద్దరు ఉద్యోగులు దొంగతనానికి
పాల్పడ్డారు. బిలాస్పూర్లోని అమెజాన్ గోదాంలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు అక్కడి
నుంచి దొంగిలించిన 38 ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరోనా నివారించడానికి
అమెజాన్ గోదాంలో భద్రతా తనిఖీలను నిలిపివేశారు. దీన్ని ఆధారంగా చేసుకున్న
నిందితులు ఐఫోన్ల దొంగతనానికి పాల్పడ్డారన్న నిర్ణయానికి వచ్చిన పోలీసులు
గిడ్డంగిలో పనిచేస్తున్న ఉద్యోగులపై కన్నేసి ఈ దొంగతనానికి పాల్పడ్డ వారిని
పట్టుకున్నారు. కరోనా దృష్టిలో ఉంచుకొని భద్రతా తనిఖీలను నిలిపివేయడాన్ని ఆసరాగా
తీసుకున్న ఇద్దరు ఉద్యోగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు ”అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్
(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ తెలిపారు.