Advertisement

  • ఆరోగ్యాన్నిఇచ్చే ‘ఇమ్మునిటీ సందేశ్‌’ స్వీట్

ఆరోగ్యాన్నిఇచ్చే ‘ఇమ్మునిటీ సందేశ్‌’ స్వీట్

By: chandrasekar Tue, 09 June 2020 4:33 PM

ఆరోగ్యాన్నిఇచ్చే ‘ఇమ్మునిటీ సందేశ్‌’ స్వీట్


స్వీట్‌ తింటే శరీరంలో కొవ్వు పెరగుతుందని చాలామంది స్వీట్‌ను పక్కన పెట్టేస్తుంటారు. డైట్‌ ఫాలో అయ్యేవాళ్లయితే, స్వీట్‌ను అసలు దగ్గరకు కూడా రానివ్వరు. ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలంటే ఇమ్మునిటీ పవర్‌ని పెంచుకోవాలని వైద్యులు చెబుతూనే ఉన్నారు. దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారం లిస్టులోకి ఇప్పుడు ‘ఇమ్మునిటీ సందేశ్‌’ అనే స్వీట్‌ వచ్చి చేరింది.

స్వీట్‌ తయారి అంటే అందులో బెల్లం గాని, చక్కెర గాని తప్పనిసరి. కానీ, ఈ స్వీట్‌లో చక్కెర, బెల్లం రెండూ వాడలేదు. బదులుగా హిమాలయ తేనెను ఉపయోగించారు. అంతేకాదు 11 రకాల మూలికలతో స్వీట్‌ను తయారు చేశారు. తులసి, పసుపు, ఏలకులు, లైకోరైస్‌, జాజికాయ, అల్లం, గాలాంగల్‌, పీపుల్‌, నల్ల మిరియాలు, నల్ల జీలకర్ర, బే ఆకులు వంటి మూలికలను తీసుకున్నామని కోల్‌కత్తా స్వీట్‌ షాపుకు చెందిన అధిపతి సుదీప్‌ మల్లిక్‌ చెప్పుకొచ్చారు. ఈ మూలికలన్నింటినీ వంటలకు వాడతాం.

ఈ స్వీట్ కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయని ఆయుర్వేద నిపుణులను సంప్రదించి దీని తయారీకి పూనుకున్నారు. చక్కెర లేదా బెల్లం ఈ మూలికల సామర్థ్యాన్ని తగ్గించగలదని, అందుకే తేనెను దాని స్థానంలో ఉపయోగించారని చెప్పారు. రెండురోజుల నుంచి 25 రూపాయలకు ఇమ్మునిటి సందేశ్‌ను విక్రయిస్తున్నాడు.


Tags :
|

Advertisement