ఆంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు
By: chandrasekar Mon, 15 June 2020 2:53 PM
ప్రజలు అదుపు తప్పి
తిరగడం వల్ల కరోనా తీవ్రరూపం దాల్చి అధిక సంఖ్యలో బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ను
కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు, రోజుకు పెరుగుతున్న
కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24
గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,633 శాంపిల్స్ పరిశీలించగా, 253
మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు ఆదివారం మీడియా బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ
తెలిపింది. ఇతర రాష్ట్రాలు (39),
విదేశాల నుంచి (2) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 294
కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం
తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు కు 4,841
చేరాయి. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో 204 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,107
మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా
చూసుకుంటే 6,152 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆదివారం ఒక్కరోజే
మరో 82 మంది
కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,723 మంది
డిశ్చార్జి కాగా, ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్
కేసులు 2,034కు
చేరుకున్నాయి. అలాగే ఆదివారం మరో ఇద్దరు కరోనా బారినపడి మరణించారు. కర్నూలు
జిల్లాలో ఒకరు, తూర్పు గోదావరి జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో
రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 84కు పెరిగింది. ప్రజలందరూ ఇంటినుండి బయటకు రాకుండా తగు
జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచనలు చేస్తున్నారు.