Advertisement

  • ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

By: chandrasekar Tue, 03 Nov 2020 7:15 PM

ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు


ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఏపీ సహకరించడం లేదని.. ఈసీ వినతులపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. తాము తొలగించిన వ్యక్తి తిరిగి సీఈసీగా రావడంతో ప్రభుత్వం సహకరించడం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు మారుతాయి. రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని రాజ్యాంగ సంస్థలను కాపడుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వానికి మూడు రోజుల్లో ఈసీ సవివర వినతిపత్రం సమర్పించాలని ప్రభుత్వం నివేదికలో 15 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనగరాజ్ తన పదవికి సంబంధించి అడ్వొకేట్ నియమించుకుంటే సొంత చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. ఆయన ఇంటి కోసం రూ.20లక్షలు, ఫర్నీచర్‌కు రూ.15 లక్షల అంశంపై ఈసీ మరోసారి పరిశీలించాలని సూచన చేసింది. అలాగే కనగరాజ్ లాయర్ ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని ఇదంతా ప్రజల సొమ్మేనని పేర్కొంది.

Tags :

Advertisement