Advertisement

  • కరోనాను జయించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దంపతులు ..

కరోనాను జయించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దంపతులు ..

By: Sankar Fri, 10 July 2020 6:34 PM

కరోనాను జయించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దంపతులు ..



కరోనా మహమ్మారి బారిన పడిన తెలంగాణ రాజకీయ నాయకులు ఒక్కొకరుగా కోలుకుంటున్నారు ..ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హన్మంత్ రావు , తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకోగా తాజాగా మరోక ఇద్దరు రాజకీయ దంపతులు కరోనా నుంచి కోలుకున్నారు ..

ఇటీవల కరోనా బారిన పడిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి దంపతులు కోలుకొని శుక్రవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘మీ దీవెనలతో కరోనాను జయించాం. ఆలేరు ప్రజలకు రుణపడి ఉంటాం’ అని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యం ప్రజలతో గడుపుతూ తమ వంతు సహకారంగా నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేశామన్నారు.

ఈ క్రమంలోనే కరోనా బారినపడ్డామని తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆశీస్సులు, ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజల దీవెనలతో కరోనాను జయించామన్నారు. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించామన్నారు.ప్రజలు కూడా అందరు మాస్కులు ధరిస్తూ , భౌతిక దూరం పాటించాలని కోరారు ..

Tags :
|

Advertisement