Advertisement

  • పుష్కరాల నిర్వహణకు రూ. 2.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం...

పుష్కరాల నిర్వహణకు రూ. 2.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం...

By: chandrasekar Tue, 17 Nov 2020 4:17 PM

పుష్కరాల నిర్వహణకు రూ. 2.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం...


తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. పుష్కారాలకు పకబ్బందీగా ఏర్పాటు చేశాయని అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.5 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

ఈ నిధులతో పుష్కరఘాట్ల వద్ద మౌలిక వసతులతోపాటు, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

కరోనా‌ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, భక్తులు నిబంధనలు పాటిస్తూ పూజలు, పిండ ప్రదానాలు చేసుకోవాలని కోరారు. సమీక్షలో దేవదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో సహా పలువురు పాల్గొన్నారు.

Tags :

Advertisement