Advertisement

  • కరోనాను ఖతం చేసే ఓ శుభవార్త...గోరువెచ్చని నీటితో పరిష్కారం...రష్యా సైంటిస్టుల వెల్లడి

కరోనాను ఖతం చేసే ఓ శుభవార్త...గోరువెచ్చని నీటితో పరిష్కారం...రష్యా సైంటిస్టుల వెల్లడి

By: chandrasekar Wed, 05 Aug 2020 8:55 PM

కరోనాను ఖతం చేసే ఓ శుభవార్త...గోరువెచ్చని నీటితో పరిష్కారం...రష్యా సైంటిస్టుల వెల్లడి


చైనాలో గతేడాది డిసెంబర్‌లో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకూ కరోనా ఎంతోమంది ప్రాణాలు తీసింది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 6,86,703 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక వెల్లడిస్తోంది. మిలియన్ల మందిపై ప్రభావం ఉంది. దీనిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కనుగొనేందుకు 160 కి పైగా పరిశోధనా బృందాలు శ్రమిస్తున్నాయి.

దీనిపై అధ్యయనం చేస్తున్న రష్యన్‌ శాస్త్రవేత్తలు కరోనాను ఖతం చేసే ఓ శుభవార్తను అందించారు. సాధారణ గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీరు తాగితే కరోనా వైరస్‌ నాశనం అవుతున్నదని తేల్చారు. రష్యా వార్తా సంస్థ నివేదిక ప్రకారం సైబీరియాలోని నోవోసిబిర్స్క్‌లోని రష్యా వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీకి చెందిన ఒక పరిశోధనా బృందం ఈ విషయాన్ని తెలుసుకుంది.

గది ఉష్ణోగ్రత కలిగిన నీరు కరోనాకి కారణమయ్యే సార్స్‌ సీఓవీ-2 వైరస్ పెరుగుదలను ఆపగలదని గుర్తించారు. రూం టెంపరేచర్‌ కలిగిన నీరు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్‌కు చెందిన 90 శాతం కణాలను చంపగలదని, అదే 72 గంటల్లో 99.9 శాతం సెల్స్‌ను నాశనం చేస్తుందని తేల్చారు. అలాగే, మరుగుతున్న నీరు కరోనా వైరస్‌ను పూర్తిగా చంపగలదని గుర్తించారు. దీంతోపాటు కరోనా వైరస్‌ అనేది క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీటిలో జీవించగలిగినప్పటికీ, తన సంతతిని పెంచుకోవడం లేదని గుర్తించారు. మొత్తంమీద కరోనా వైరస్‌ జీవితకాలం నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు నిర్ధారించారు.

Tags :
|

Advertisement