Advertisement

  • నాలుగో రోజు కూడా లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్

నాలుగో రోజు కూడా లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్

By: chandrasekar Tue, 07 July 2020 6:29 PM

నాలుగో రోజు కూడా లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్


బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా లాభాల బాట పట్టింది. దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. మార్కెట్ సోమవారం 4 నెలల గరిష్ట స్థాయి వద్ద క్లోజయ్యింది. హెవీవెయిట్ షేర్లు ర్యాలీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 640 పాయింట్ల వరకు ఎగసింది. నిఫ్టీ కూడా 10,800 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు వచ్చేసరికి సెన్సెక్స్ 466 పాయింట్ల లాభంతో 36,487 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 10,764 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

* నిఫ్టీ 50లో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్ షేరు ధర 4 శాతం పెరుగుదలతో రూ.1855కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి.

* నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభపడ్డాయి. నిఫ్టీ ఫార్మా 0.6 శాతం నష్టపోయింది. ఇక నిఫ్టీ ఆటో దాదాపు 3 శాతం, నిఫ్టీ మెటల్ 2.4 శాతం, నిఫ్టీ రియల్టీ 3 శాతం చొప్పున ర్యాలీ చేశాయి.

* అదేసమయంలో బజాజ్ ఆటో, గెయిల్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఆటో 1 శాతానికి పైగా క్షీణించింది.

* అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్పంగా లాభపడింది. 2 పైసలు లాభంతో 74.68 వద్ద కదలాడుతోంది.

* అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.84 శాతం పెరుగుదలతో 43.16 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.22 శాతం క్షీణతతో 40.56 డాలర్లకు తగ్గింది.

Tags :
|
|

Advertisement