Advertisement

  • దశాబ్దం పాటు రోజుకు ఒక్కపూటే తినేదాన్నని తెలిపిన భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్

దశాబ్దం పాటు రోజుకు ఒక్కపూటే తినేదాన్నని తెలిపిన భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్

By: chandrasekar Tue, 25 Aug 2020 09:08 AM

దశాబ్దం పాటు రోజుకు ఒక్కపూటే తినేదాన్నని తెలిపిన భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్


దశాబ్ద కాలం పాటు రోజుకు ఒక్కపూటే తినేదాన్నని భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్‌ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దాదాపు పదేండ్ల పాటు తాను పస్తులు ఉన్నానని భారత మహిళల ఖోఖో జట్టు మాజీ కెప్టెన్‌, అర్జున అవార్డు విజేత సారికా కాలే చెప్పారు. అయితే ఖోఖోలో అడుగుపెట్టాక తన జీవితం మారిపోయిందని తెలిపారు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత జట్టుకు స్వర్ణం అందించిన సారిక ప్రస్తుతం మహారాష్ట్రలో క్రీడా అధికారిగా పని చేస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా ఆమె ఈ నెల 29న వర్చువల్‌గా జరిగే ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఓ ఇంటర్వ్యూలో సారిక కాలే మాట్లాడారు. ఈ ఏడాది అర్జున అవార్డు వచ్చింది. నేను ఖోఖో ఆడిన రోజులు నాకింకా గుర్తున్నాయి. దాదాపు దశాబ్దం పాటు రోజుకు ఒక్కపూటే తినేదాన్ని. నా కుటుంబ పరిస్థితులే నన్ను ఆట వైపు నడిపించాయి. ఖోఖో నా జీవితాన్ని మార్చేసింది. పేదరికంలో పుట్టడంతో అనేక రకాలుగా ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.

సారిక కాలే అమ్మ కుట్టు మిషన్‌ కుట్టేది మరియు ఇండ్లలో పనిచేసేది. శారీరక సమస్యల కారణంగా మా నాన్న కుటుంబ పోషణకు సరిపడా సంపాదించలేకపోయేవారు. ఖోఖో శిక్షణ శిబిరం, మ్యాచ్‌లు ఉన్న సమయంలోనే ప్రత్యేక డైట్‌ తీసుకునేదాన్ని. ఎన్ని కష్టాలు ఉన్నా కుటుంబం నాకు ఎంతో మద్దతుగా నిలిచింది అని కాలే తెలిపారు. బాగా శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.

Tags :

Advertisement