జీఎస్టీ ఎగవేత కోసమే ఏర్పడిన నకిలీ సంస్థలపై కేంద్రం దృష్టి
By: chandrasekar Wed, 28 Oct 2020 1:48 PM
న్యూఢిల్లీ: కేంద్ర
ప్రభుత్వం జీఎస్టీ ఎగవేత కోసమే ఏర్పడిన
నకిలీ సంస్థలపై దృష్టి సారించింది. ఈ తరహా కంపెనీలతో ఓ ‘రిస్కీ’ జాబితాను సిద్ధం
చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఇద్దరు తెలిపారు.
కృత్రిమ మేధస్సు, ఆధార్
నమోదు ఆధారంగా ఈ మోసపూరిత సంస్థల కార్యకలాపాలను చాలా దగ్గరగా గమనించనున్నట్లు
చెప్పారు. ఇప్పటికే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను అక్రమంగా పొందుతున్న
ఎగుమతిదారులతో కేంద్ర ప్రభుత్వం ఓ ‘రిస్కీ’ ఎక్స్పోర్టర్స్ లిస్టును తయారు చేసిన
విషయం తెలిసిందే.
అలాగే ఏ వ్యాపారం లేకుండా
జీఎస్టీ రిఫండ్స్ను తీసుకుంటున్న సంస్థల భరతం పట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.
నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి ఎన్నో బోగస్ కంపెనీలు జీఎస్టీ రిఫండ్స్ను
పొందుతున్నాయని, ఇటీవలే పుణెలో ఇలాంటి ఓ సంస్థను గుర్తించామని
అధికారులు అంటున్నారు.