Advertisement

  • తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

By: chandrasekar Fri, 03 July 2020 10:47 AM

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

అందులో భాగంగా ఉద‌యం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, గంధం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. అనంతరం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వ‌హించారు.

Tags :
|

Advertisement