విద్యుదాఘాతానికి గురై రైతు అక్కడికక్కడే మృతి
By: chandrasekar Thu, 10 Sept 2020 3:05 PM
వరంగల్ జిల్లా పర్వతగిరి
మండలం రోళ్లకల్లు గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే
గ్రామానికి చెందిన నిమ్మనాయక్ (55)
రోజువారి కార్యాచరణలో భాగంగా బుధవారం సాయంత్రం తన
వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు.
పైరుకు నీరు పెడదామని
బోరు ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
దీ౦తో కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోవడంతో మృతుడి భార్య, పిల్లలు
రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
Tags :
died |