Advertisement

  • ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఐదో తరగతి గురుకుల ప్రవేశపరీక్ష

ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఐదో తరగతి గురుకుల ప్రవేశపరీక్ష

By: chandrasekar Mon, 02 Nov 2020 4:24 PM

ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఐదో తరగతి గురుకుల ప్రవేశపరీక్ష


జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఈపరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దోమకొండ మండల కేంద్రంలోని బీసీ మహిళా గురుకుల పాఠశాలలో పరీక్షను నిర్వహించారు.

పరీక్షకు మొత్తం 500 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 363 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ స్వర్ణలత పేర్కొన్నారు. 137 మంది విద్యార్థులు హాజరుకానట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని రూట్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ పర్యవేక్షించారు.

నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో ఐదోతరగతిలో ప్రవేశం కోసం పరీక్ష నిర్వహించారు. మొత్తం రెండు వందల మంది విద్యార్థులకు 144 మంది హాజరయ్యారని, 56 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ వెంకటనారాయణ తెలిపారు.

ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్రవేశపరీక్షకు 320 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 251 మంది విద్యార్థులు హాజరయ్యారని, 69 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ మహేందర్‌ తెలిపారు.

Tags :
|

Advertisement