Advertisement

ఇంగ్లీష్‌ జట్టు 51 పరుగులకే మూడు కీలక వికెట్లు

By: chandrasekar Fri, 10 July 2020 2:45 PM

ఇంగ్లీష్‌ జట్టు 51 పరుగులకే మూడు కీలక వికెట్లు


తొలి టెస్టులో వెస్టిండీస్‌తో ఆతిథ్య ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. విండీస్‌ పేసర్‌ గాబ్రియెల్‌ ధాటికి ఇంగ్లీష్‌ జట్టు 51 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకుంది. గాబ్రియెల్‌ తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెడుతున్నాడు.

స్వల్ప వ్యవధిలోనే ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్లు జో డెన్లీ(18: 58 బంతుల్లో 4ఫోర్లు), రోరీ బర్న్స్‌(30: 85 బంతుల్లో 4ఫోర్లు)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపి ఇంగ్లాండ్‌కు షాకిచ్చాడు. దీంతో జట్టు స్కోరు 51కే ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విండీస్‌ పేసర్‌ గాబ్రియెల్ తొలి మూడు వికెట్లను పడగొట్టడం విశేషం. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ సిబ్లేను గాబ్రియెల్‌ డకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం స్టోక్స్‌(5), జాక్‌ క్రాలే(5) క్రీజులో ఉన్నారు.

Tags :
|
|

Advertisement