దోస్త్-2020 అడ్మిషన్ల ప్రక్రియ మూడు ఫేజ్లలో అక్టోబర్ 12 నాటికి పూర్తి
By: chandrasekar Sat, 05 Sept 2020 5:32 PM
తెలంగాణలో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చు. ఆగష్టు 24 నుంచి మొదలైన ఈ దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ మూడు ఫేజ్లలో అక్టోబర్ 12 నాటికి పూర్తి కానుంది. ఇక ఆ తర్వాత విద్యార్థులకు డిజిటల్ లేదా ఫిజికల్ క్లాసులు మొదలుపెడతారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దోస్త్కు సంబంధించిన మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మొదటి ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఆగష్టు 24న ప్రారంభం కాగా సెప్టెంబర్ 7తో ముగియనుంది.
దరఖాస్తు చేయటకు అనుసరించవలసిన పద్ధతి
https://dost.cgg.gov.in/
వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు. అలాగే
105 దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలతో పాటు T
App Folio Mobile Appలో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు.
ముఖ్య విషయాలు:
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ర్టేషన్లు జరుగుతాయి.
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంది.
సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగును.
సెప్టెంబర్ 17 నుంచి 22
వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్
సెప్టెంబర్ 17 నుంచి 23
వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
సెప్టెంబర్
28న రెండో విడత సీట్ల కేటాయింపు
సెప్టెంబర్
28 నుంచి అక్టోబర్ 3
వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం
అక్టోబర్ 8న మూడో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
రిజిస్ట్రేషన్కు అధికారిక వెబ్సైట్:
https://dost.cgg.gov.in/