Advertisement

లాభాల్లోనే క్లోజయిన దేశీ స్టాక్ మార్కెట్

By: chandrasekar Mon, 17 Aug 2020 7:50 PM

లాభాల్లోనే క్లోజయిన  దేశీ స్టాక్ మార్కెట్


లాభాల్లో ప్రారంభమైన మార్కెట్ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. ఆర్ఐఎల్, ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ వంటి షేర్ల కారణంగా నష్టపోయింది. అయితే మళ్లీ చివరకు లాభాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 385 పాయింట్లు శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ కూడా 11,144 పాయింట్ల నుంచి 11,255 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యింది. చివరకు వచ్చేసరికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 38,051 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 11,247 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

నిఫ్టీ 50లో ఎన్ టీపీసీ, ఐషర్ మోటార్స్, జీ ఎంటర్ టైన్మెంట్, హిందాల్కో, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. ఎన్ టీపీసీ 7 శాతం పైగా పరుగులు పెట్టింది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లన్నీ మిశ్రమంగానే క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్స్ లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే ఉండిపోయాయి. నిఫ్టీ ఆటో 2 శాతం, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ లు 2 శాతానికి పైగా పెరిగాయి. అదేసమయంలో ఎస్ బీఐ, భారతీ ఎయిర్ టెల్, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. ఎస్ బీఐ 1.5 శాతం, రిలయన్స్ 1 శాతం చొప్పున క్షీణించాయి.

అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్ గానే ముగిసింది. 2 పైసలు లాభంత 74.88 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్ కు 0.07శాతం క్షీణతతో 41.98 డాలర్లకు తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 0.22 శాతం తగ్గుదలతో 44.70 డాలర్లకు క్షీణించింది.

Tags :
|
|
|

Advertisement