Advertisement

  • కేరళ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 62 చేరిన మృతుల సంఖ్య

కేరళ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 62 చేరిన మృతుల సంఖ్య

By: Sankar Wed, 19 Aug 2020 8:54 PM

కేరళ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 62 చేరిన మృతుల సంఖ్య


రాజమాల ప్రాంతంలో కొడచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 62కి చేరింది. శిథిలాల నుంచి ఈరోజు ఓ తొమ్మిదేళ్ల బాలుడి మృతదేహం వెలికి తీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.

కాగా, ఇప్పటికీ మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అయితే వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న రాజమాల ప్రాంతంలో విపరీతమైన వర్షాలకు శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా, అనేక మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రమాద ప్రాంతాన్ని శనివారం పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్.. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Tags :
|
|
|
|

Advertisement