తెలుగు దేశం పార్టీలో ఇద్దరు సీనియర్ నేతల మరణంతో తీవ్ర విషాదం...
By: chandrasekar Mon, 14 Dec 2020 8:47 PM
తెలుగు దేశం పార్టీకి
చెందిన మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ఇద్దరు మృతిచెందారు. విజయవాడకు చెందిన వేరు ఒకే రోజు మృతి చెందడంతో
పార్టీ కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. టీడీపీ మాజీ కార్పొరేటర్లు
ఆత్కూరి రవికుమార్, గోపర్తి నరసింహారావు సోమవారం కన్నుమూశారు.
ఇద్దరి నేతల మరణంపై
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేశారు.‘‘విజయవాడ
తెలుగుదేశం నాయకులు, కృష్ణలంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావు గారు, మధురానగర్
మాజీ కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్ మరణించడం బాధాకరం. వారి మరణం పార్టీకి తీరని
లోటు. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి
చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అంటూ లోకేష్ వరుస ట్వీట్లు
చేశారు.