అత్తగారిని దారుణంగా హత్య చేయించిన కోడలు
By: chandrasekar Wed, 15 July 2020 7:56 PM
పచ్చటి సంసారాలను
బుగ్గిపాలు చేస్తున్నాయి వివాహేతర సంబంధాలు. తాజాగా ఓ వివాహిత పక్కింటి కుర్రాడితో
అక్రమ సంబంధం పెట్టుకోగా, నిలదీసిన అత్తగారిని దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన
బీహార్ లోని బేగూసరాయ్ ప్రాంతంలోని రాంపూర్ చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం
రేపింది. నిందితురాలు సోనం (పేరుమార్పు) అనే యువతికి రాజు అనే యువకుడితో ఆరు నెలల
క్రితం పెద్దలు వివాహం జరిపించగా, ఆమె పక్క ఇంట్లో ఉండే పృథ్వీరాజ్ తో వివాహేతర బంధం
పెట్టుకుంది. ఈ విషయం అత్త జమునా బాయికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. పృథ్వీ
రాజ్ ను కలవవద్దని జమునాబాయి గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెను అడ్డు
తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
వెంటనే ప్రియుడికి ఫోన్
చేసి తన అత్తను హత్య చేయాలని కోరింది. ఇద్దరు కలిసి ఇంట్లో నిద్రిస్తున్న అత్త
జమునా బాయిపై మెడపై కత్తితో పృథ్వీ రాజ్ దాడి చేశాడు. మెడపై నరకడంతో జమునాబాయి
అక్కడికక్కడే చనిపోయింది. తెల్లవారగానే ఇంట్లో దొంగలు పడ్డారని, అత్తగారిని
హత్యచేసి, ఇంట్లో
డబ్బు నగలు దోచుకెళ్లారని సోనం నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల విచారణలో
అసలు నిజాలు బయటపడ్డాయి. కాల్ డేటా ఆధారంగా సోనం, ఆమె ప్రియుడు పృథ్వీరాజ్
మధ్య కాల్ డేటా, అలాగే మెసేజీల ద్వారా అసలు విషయం తెలిసి పోయింది. ఈ
కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు పంపామని పోలీసులు తెలిపారు.