మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుత టాప్ హీరోయిన్ ?
By: chandrasekar Fri, 11 Sept 2020 4:25 PM
తమిళంలో సూపర్ హిట్ అయిన
వెదాలం మూవీని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ అవనున్న సంగతి తెలిసిందే. మెహర్
రమేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో ఒక హీరోయిన్ కోసం
వేటలో ఉన్న మెహర్ రమేశ్. ఆ పాత్ర కోసం ఫిదా మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్కి జంటగా
నటించిన కేరళ బ్యూటీ సాయి పల్లవిని కలిసినట్టు సమాచారం. వెదాలం తెలుగు రీమేక్ మూవీ
ప్రీ ప్రొడక్షన్ పనులతో మెహర్ రమేశ్ బిజీగా ఉన్నాడు. సీరియస్ ఫ్యామిలీ డ్రామా
బ్యాక్డ్రాప్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి లాంటి పేరున్న నటీనటులు
ఇంకెంతో మంది నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇక మెహర్ రమేశ్ చిత్రాల
విషయానికొస్తే గతంలో కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి చిత్రాలు చేసిన మెహర్ రమేశ్ షాడో తర్వాత
చాలా గ్యాప్ తీసుకున్నాడు. భారీ గ్యాప్ తెచ్చిన కసితో ఉన్న మెహర్ రమేశ్ చిరు
సినిమాతో మళ్లీ బ్యాక్ అవ్వాలని వెయిట్
చేస్తున్నాడు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ
డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు
మూవీ యూనిట్ చెబుతోంది.