దేశంలోని కోఆపరేటివ్ బ్యాంకులు ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోకి వస్తాయి: కేంద్ర ప్రభుత్వం
By: chandrasekar Thu, 25 June 2020 10:49 AM
అర్బన్ కోఆపరేటివ్
బ్యాంక్స్, మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులను కూడా రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కిందకు తీసుకువచ్చామని ప్రకటించింది. కేంద్ర
ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చామని, కేంద్ర కేబినెట్ కూడా
దీనికి ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
దీంతో దేశంలోని
కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోకి వస్తాయి. కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020లోనే కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ కిందకు
తీసుకువస్తామని వెల్లడించారు. ఇప్పుడు కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ఈ నిర్ణయం
తీసుకుంది.
దీని వల్ల 1482
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు,
58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ
పర్యవేక్షణ ఉంటుంది. దీంతో 8.6 కోట్ల మంది డిపాజిట్లకు బ్యాంకింగ్ వ్యవస్థపై
విశ్వాసం మరింత పెరుగుతుంది. అలాగే కేంద్రం రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది.
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద అందించే రుణాలు వడ్డీ రేట్ల రాయితీకి మోదీ
సర్కార్ ఆమోదం తెలిపింది.
శిశు లోన్ కేటగిరి కింద
రుణాలు తీసుకునే వారికి 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు ఈ మేరకు నిర్ణయం
తీసుకుంది. ప్రధాని మోదీ 2015 ఏప్రిల్ 8 ముద్రా యోజన స్కీమ్ను తీసుకువచ్చిన విషయం
తెలిసిందే.
చిన్న, మధ్య
తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రుణం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని
తీసుకువచ్చారు. బ్యాంకులు, ఆర్ఆర్బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు
ఈ తరహా రుణాలు అందిస్తాయి. ముద్ర యోజన కింద మూడు రకాల కేటగిరిల కింద రుణాలు
పొందొచ్చు. శిశు, కిషోర్, తరుణ్ అనేవి వీటి పేర్లు. శిశు కేటగిరి కింద రూ.50,000 వరకు రుణం పొందొచ్చు. అదే కిషోర్ కేటగిరి కింద రూ.50 వేల
నుంచి రూ.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇక తరుణ్ విభాగం కింద
రూ.5 లక్షల
నుంచి రూ.10 లక్షల వరకు లోన్ లభించవచ్చు.