Advertisement

  • క‌రోనా సోకిన యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యులు పరార్

క‌రోనా సోకిన యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యులు పరార్

By: chandrasekar Mon, 22 June 2020 5:17 PM

క‌రోనా సోకిన యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యులు పరార్


ప్రస్తుతం కరోనా కేసులు ఎక్క్కువగా నమోదవుతున్న నేపథ్యంలో యూపీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓ యువ‌కుడు, అత‌ని కుటుంబ స‌భ్యులు పారిపోయారు. దీంతో ఓ 40 కుటుంబాల‌ను క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు, వైద్యాధికారులు. యూపీలోని హ‌ర్దోయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం గ‌త కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వ‌ల‌స వెళ్లారు. ఢిల్లీ నుంచి ఈ నెల 15వ తేదీన త‌మ సొంత గ్రామ‌మైన తెర్వాద‌హిగావ‌న్ కు చేరుకున్నారు. 16వ తేదీన ఓ పెళ్లికి వారు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కుటుంబంలో ఇద్ద‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ర‌క్త న‌మూనాల‌ను వైద్యుల‌కు ఇచ్చారు.

మొత్తం కుటుంబ స‌భ్యులైన ఆరుగురిలో 18 ఏళ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన వైద్యాధికారులు ఆ కుటుంబం వ‌ద్ద‌కు చేరుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంత‌లోపే యువ‌కుడితో పాటు మిగ‌తా కుటుంబ స‌భ్యులు పారిపోయారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఆ గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 40 కుటుంబాల‌ను క్వారంటైన్ లో ఉంచారు. యువ‌కుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల ఆచూకీ కోసం పోలీసులు వెదుకుతున్నారు.

Tags :

Advertisement