హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్లో కలకలం రేపిన కాంగ్రెస్ నేత
By: chandrasekar Fri, 28 Aug 2020 5:14 PM
గురువారం జమ్మికుంట, హుజూరాబాద్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు, సేవలను పరిశీలించేందుకు రాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంట వచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తాను వేసుకున్న పీపీఈ కిట్ను నిర్లక్ష్యంగా హుజూరాబాద్ హాస్పిటల్లో జనం తిరిగే చోటా పడేయడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికీ సోకుతుందని చెప్పిన సదరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణనే ఇలా తను ధరించిన పీపీఈ కిట్టును నిర్లక్ష్యంగా పడేసిపోవడంతో హాస్పిటల్ కి వచ్చిపోయేవారు దానిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. కేవలం కరోనా వ్యాప్తి చెందుతుందన్న అనుమానం ఉన్నప్పుడు మాత్రమే పీపీఈ కిట్టును ధరించి దానిని అంతే సురక్షితంగా పడేసి వెంటనే తగలబెట్టడం చెయ్యాలి.
కానీ కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడే నిర్లక్ష్యంగా తన పీపీఈ కిట్టును పడేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రవీణ్రెడ్డి దానిని సిబ్బందితో అక్కడి నుంచి తొలగించి ఆ స్థలంలో హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు.