Advertisement

కుప్పకూలిన రెస్టారెంట్‌.. 29 మంది దుర్మరణం

By: Anji Sun, 30 Aug 2020 2:03 PM

కుప్పకూలిన రెస్టారెంట్‌.. 29 మంది దుర్మరణం

చైనాలోని శాంషీ ప్రావిన్సులోని ఓ రెస్టారెంట్‌ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో స్థానికులు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగిస్తోన్న సిబ్బంది ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు.

రెస్టారెంటులో ఓ పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 21 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :
|

Advertisement