గోరటి వెంకన్న కూతురు పెళ్ళికి హాజరైన తెలంగాణ ముఖ్య మంత్రి...
By: chandrasekar Fri, 11 Dec 2020 10:10 PM
ప్రముఖ కవి, ఎమ్మెల్సీ
గోరటి వెంకన్న కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హాజరయ్యారు. నూతన
వధూవరులపై అక్షింతలు వేసి కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ వివాహానికి సీఎం కేసీఆర్తో
పాటు ఎమ్మెల్సీ కవిత, మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్
రెడ్డి, వేముల
ప్రశాంత్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
శుక్రవారం నాడు హైదరాబాద్లో
అంగరంగ వైభవంగా జరిగిన గోరటి వెంకన్న కుమార్తె పెళ్లికి రాజకీయ ప్రముఖులతో పాటు
సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆర్ నారాయణ మూర్తి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు.
కాగా, ఇటీవలే
గోరటి వెంకన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
గవర్నర్ కోటా ముగ్గురు
ఎమ్మెల్సీలను నియమించగా, వారిటో గోరటి వెంకన్న ఒకరు. ఈ సందర్భంగా వధూవరులను
ఆశీర్వందించి వారికి శుభా కాంక్షలు తెలిపారు. ఇంకా ఈ వివాహానికి మంత్రులు
సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే డి.సుధీర్రెడ్డి
తదితరులు కూడా ఉన్నారు.