పేదల హక్కులను హరిస్తున్న కేంద ప్రభుత్వం....
By: chandrasekar Thu, 10 Dec 2020 9:40 PM
కాంగ్రెస్ నేత రాహుల్
గాంధీ కేంద ప్రభుత్వంపై ఆరోపణలు చేసారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా
ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేదల హక్కులను
లాక్కుంటోంది. ఇది మానవత్వానికి వ్యతిరేక నేరం.
ఈ దేశ ఉత్తమ భవిష్యత్తు
కోసం మనం అన్ని వర్గాలను గౌరవించాలి’ అని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల ప్రాథమిక
హక్కులను హరిస్తోంది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఐక్యరాజ్య
సమితి సాధారణ సభ 1948 డిసెంబర్ 10న సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఆమోదించిన
నేపథ్యంలో దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఏటా డిసెంబరు 10న మానవ
హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Tags :
rights |