Advertisement

  • ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం

By: chandrasekar Fri, 26 June 2020 6:35 PM

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం


కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుల విషయంలో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి గడువును ను జులై 31 వరకు పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలగనుంది.

2018-19 ఏడాదికి గాను సవరణ చేయబడిన రిటర్న్స్ దాఖలు చేయడానికి విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా దాన్ని జులై 31 కి పెంచిన కేంద్రం మరోవైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది.

కాగా ఇప్పటివరకు ప్రకటించిన డెడ్‌లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా, కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి 31లో ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలని లేదంటే రూ.10వేల జరిమానా భారం పడొచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

Tags :
|

Advertisement