ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
By: chandrasekar Fri, 26 June 2020 6:35 PM
కేంద్ర ప్రభుత్వం పన్ను
చెల్లింపుల విషయంలో మరో ముఖ్యమైన నిర్ణయం
తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం చల్లని కబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం
మరోసారి పొడిగించింది.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి గడువును ను జులై 31 వరకు
పెంచింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా ఓ ప్రకటనను
విడుదల చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలగనుంది.
2018-19 ఏడాదికి గాను సవరణ చేయబడిన రిటర్న్స్ దాఖలు
చేయడానికి విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా దాన్ని జులై 31 కి
పెంచిన కేంద్రం మరోవైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకునే గడువును కేంద్రం
మరోసారి పొడిగించింది.
కాగా ఇప్పటివరకు
ప్రకటించిన డెడ్లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా, కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో గడువును వచ్చే ఏడాది మార్చి వరకు
పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి 31లో ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలని లేదంటే
రూ.10వేల
జరిమానా భారం పడొచ్చని ప్రభుత్వం ప్రకటించింది.