Advertisement

  • కఠిన నిబంధనలతో విమానాల రాకపోకలకు తిరిగి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

కఠిన నిబంధనలతో విమానాల రాకపోకలకు తిరిగి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం

By: chandrasekar Sat, 29 Aug 2020 5:48 PM

కఠిన నిబంధనలతో విమానాల రాకపోకలకు తిరిగి అనుమతించిన కేంద్ర ప్రభుత్వం


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలతో విమానాల రాకపోకలకు తిరిగి అనుమతించి౦ది. వాటిలో భోజన సౌకర్యం కల్పించడానికి కూడా అంగీకరించింది. అలాగే ముఖానికి మాస్క్‌ ధరించడానికి నిరాకరించే వారి విషయంలో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించని వారిని విమానయాన సంస్థలు నో ఫ్లై జాబితాలో చేర్చవచ్చని గురువారం అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడించింది. మాస్కులు వేసుకొని వారు ఇకపై విమానాల్లో ప్రయాణించడానికి అనుమతి ఉండదని కేంద్రం తేల్చి చెప్పింది. మే 25వ తేదీన విమాన సేవలు పునఃప్రారంభమైన తరుణంలో దేశీయ విమానాల్లో భోజన సదుపాయాలకు అనుమతివ్వలేదు. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ముందుగానే ప్యాక్‌ చేసిన కోల్డ్‌ మీల్‌, స్నాక్స్‌ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కానీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం ఈ నిబంధనలకు సడలింపులు ఇచ్చింది.

కేంద్ర విమానయాన శాఖ కొత్త నిబంధనలు:

నిబంధనల ప్రకారం అంతర్జాతీయ విమానాల్లో వేడి భోజనం, పరిమితంగా పానీయాలు ఏర్పాటు చేయొచ్చు.
ప్రయాణ సమయం ఆధారంగా దేశీయ విమానాల్లో ముందుగా ప్యాక్‌ చేసిన స్నాక్స్, పానీయాలు, భోజనం అందించొచ్చు.
ముఖానికి మాస్క్‌ ధరించడానికి నిరాకరించిన వ్యక్తులను సంస్థలు నో ఫ్లై జాబితాలో చేర్చడానికి అనుమతి.
విమాన ప్రయాణ సమయంలో వాడే ట్రేలు, ప్లేట్లు, స్పూన్లు వంటి వాటిని ఒక్కసారి మాత్రమే వినియోగించాలి.
అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత విమానంలో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని ‘నో ఫ్లై జాబితా’లో చేర్చవచ్చు. ఇతర సంస్థలు సదరు ప్రయాణికుడి విషయంలో అదే నిర్ణయం తీసుకోవచ్చు.
కరోనా కారణంగా విధించిన ఆంక్షలను రెండు నెలల తర్వాత సడలించడంతో మే 25 నుంచి దేశీయ విమానాలు తిరిగి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. కరోనా ముందుతో పోల్చుకుంటే 45 శాతం విమానాలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

Tags :

Advertisement