Advertisement

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.

By: chandrasekar Tue, 16 June 2020 5:21 PM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.


ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న వారికి బ్యాంక్ లు ఎమర్జెన్సీ రుణాలు అందిస్తోంది. అయితే ఈ తరహా రుణాలు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం కొందరికే లభిస్తాయి.

కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వ్యాపారాలు జరగక తీవ్రంగా నష్టపోతున్నారా? బిజినెస్‌లు మూతపడ్డాయా? అయితే మీకు శుభవార్త. బ్యాంకులు ఎమర్జెన్సీ రుణాలు అందిస్తున్నాయి. దీంతో సులభంగానే రుణం పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా సంక్షోభంలో సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ఎమర్జెన్సీ రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. దీని కోసం గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొంది. దీంతో పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్ నిబంధనలను సరళీకరించింది. దీంతో బిజినెస్ వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి.

ఇప్పుడు అవి కరోనా వైరస్ కారణంగా నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. దీని నుంచి గట్టెక్కడానికే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికి రుణాలు అందిస్తోంది. బ్యాంక్ నుంచి ఎంఎస్ఎంఈలు వర్కింగ్ క్యాపిటల్ కింద రుణాలు తీసుకోవచ్చు. రూ.5 కోట్ల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంది. తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించొచ్చు. వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. అంతేకాకుండా బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. ఇంకా గ్యారంటీ ఫీజు కూడా ఉండదు. కాగా మరోవైపు బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను 6.85 శాతానికి తగ్గించింది.

Tags :

Advertisement