Advertisement

  • స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధ౦ చేసిన కేంద్రం

స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధ౦ చేసిన కేంద్రం

By: chandrasekar Thu, 17 Dec 2020 4:53 PM

స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధ౦ చేసిన కేంద్రం


కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. వ్యవసాయం, టెలీకం, విద్యుత్ రంగాలకు సంబంధించి అనుమతులిచ్చింది. చక్కెర ఎగుమతుల సబ్సిడీ, రేడియో వేవ్స్ అమ్మకానికి అనుమతి ఇచ్చింది. 20 ఏళ్ల గడువుతో నిర్వహిస్తున్న వేలం ద్వారా 2 వేల 251 రేడియా తరంగాల్ని అమ్మకానికి ఉంచారు. వచ్చే ఏడాది మార్చ్ నెలలో ఈ వేలం జరగనుంది. 700 ఎంహెచ్‌జెడ్ నుంచి 800, 900, 2100, 2300, 2500 ఎంహెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వేలానికి అనుమతి లభించింది.

5జీ సేవలకు సంబంధించిన వేలానికి కూడా అనుమతిచ్చింది. 5జి సర్వీసుల కోసం ట్రాయ్ 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 3300-3600 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్ జెడ్‌కు 492 కోట్ల రూపాయల్ని బేస్ ధరగా నిర్ణయించారు. రక్షణ శాఖ మాత్రం 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించనుండటంతో 175 ఎంహెచ్‌జెడ్ మాత్రమే రానుంది. చక్కెర రైతుల ఆందోళన నేపధ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి అన్నారు. సబ్సిడీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కేంద్ర మంత్రివర్గం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Tags :
|
|

Advertisement