Advertisement

  • డీఆర్ డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చిన కేంద్రం

డీఆర్ డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చిన కేంద్రం

By: chandrasekar Tue, 25 Aug 2020 6:15 PM

డీఆర్ డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చిన కేంద్రం


కేంద్రం మరో రెండుళ్ల పాటు ఆర్‌డీవో ఛైర్మన్‌ జి. సతీశ్‌ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 24 సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సతీశ్ రెడ్డి ఈ పదవిలో మరో రెండేళ్లు కొనసాగనున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ చీఫ్‌గా కొనసాగుతున్న సతీశ్ రెడ్డి.. రక్షణ మంత్రికి శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌ రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. డీఆర్‌డీవోలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గానూ సతీశ్ రెడ్డి పని చేశారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన ఆయన క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూత అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన పనితీరుపై విశ్వాసంతో డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించింది. రక్షణ, పరిశోధన రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేంత వరకు తన ఎజెండా కొనసాగుతుందని సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. పదవీ పొడగింపు ఉత్తర్వులు అందుకున్న అనంతరం ఆయన న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ప్రతినిధితో మాట్లాడారు.

Tags :

Advertisement