యువతిని గర్భవతి చేసి మోజు తీరాక ముఖం చాటేసిన బావ
By: chandrasekar Fri, 14 Aug 2020 4:00 PM
యువతిని ప్రేమ పేరుతో
మోసం చేసి గర్భవతి అయిన తరువాత మోజు తీరి ముఖం చాటేసిన బావ విషయం వెలుగులోనికి
వచ్చింది. ఒంగోలు పట్టణానికి చెందిన యువతిని దూరపు బంధువైన యువకుడు ప్రేమపేరుతో
నమ్మించి పెళ్లి చేసుకుంటానని లోబరుచుకుని
గర్భవతిని చేశాడు. మోజు తీరాక పెళ్లి చేసుకోనంటూ మొరాయించాడు. ప్రేమిస్తున్నానంటూ
వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దూరపు బంధువే కావడం అందులోనూ బావ వరస అవడంతో ఆమె నమ్మేసింది.
వాళ్ల ఇద్దరు పెళ్లికి
ముందే హద్దులు దాటడంతో యువతి గర్భం దాల్చింది. ఆ విషయం తెలిసి గర్భం పోయేందుకు
మాత్రలు వేశాడు. మరోసారి కూడా అదే తంతు. చేసుకోబోయే వాడే కదా అని ఆమె తలొంచింది.
మూడోసారి గర్భం దాల్చడంతో కథ అడ్డం తిరిగింది. మరదలిపై మోజు తీరిన బావ ముఖం
చాటేశాడు. దీంతో అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన ప్రకాశం
జిల్లాలో చోటుచేసుకుంది. ఒంగోలు పట్టణానికి చెందిన యువతి స్థానికంగా ఓ బట్టల
దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు దూరపు బంధువు, బావ వరసయ్యే వెంగముక్కపాలేనికి చెందిన యువకుడు
దగ్గరయ్యాడు.
ప్రేమిస్తున్నానంటూ
నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకుంటున్నాడు. పెళ్లికి ముందే ఇద్దరూ
హద్దులు దాటేయడంతో ఆమె గర్భం దాల్చింది. పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పి గర్భం
పోయేందుకు మాత్రలు ఇచ్చాడు. రెండుసార్లు గర్భం తీయించాడు. అయినా శారీరక సంబంధం
కొనసాగించడంతో మూడోసారి గర్భం దాల్చింది. దీంతో యువతి పెళ్లి ఎప్పుడు
చేసుకుందామంటూ నిలదీయడంతో ఊహించని షాకిచ్చాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి
చెప్పేసి ముఖం చాటేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని బాధితురాలు పోలీసులను
ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని రెండో
పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ
మొదలుపెట్టారు. యువతులు తొందర పాటువల్ల మోసానికి గురై సమాజంలో అనేక రకాలుగా ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు.