Advertisement

స‌రిహ‌ద్దు వివాదం ద్వైపాక్షిక అంశ‌౦: చైనా

By: chandrasekar Thu, 29 Oct 2020 6:39 PM

స‌రిహ‌ద్దు వివాదం ద్వైపాక్షిక అంశ‌౦: చైనా


భార‌త్ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకునేందుకు చేసే చ‌ర్య‌ల‌కు అమెరికా ఎప్పుడు అండ‌గా నిలుస్తుంద‌ని అగ్ర‌దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఇండియా టూర్‌లో ఉన్న ఆయ‌న మంగ‌ళ‌వారం ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ కామెంట్ల‌పై ఇవాళ డ్రాగ‌న్ దేశం చైనా స్పందించింది. స‌రిహ‌ద్దు వివాదం ద్వైపాక్షిక అంశ‌మ‌ని, ఈ విష‌యంలో వాస్త‌వాల‌ను, నిజాల‌ను అమెరికా గ్ర‌హించాల‌ని చైనా తెలిపింది. చైనా ఎంబ‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలు, న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కులపై మూడ‌వ పార్టీ జోక్యం అవ‌స‌రం లేద‌ని చైనా పేర్కొంది.

భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు స‌మ‌స్య ద్వైపాక్షిక అంశ‌మ‌ని, రెండు దేశాలు ఈ అంశంపై చ‌ర్చిస్తున్నాయ‌ని, సైనిక‌ప‌రంగా, దౌత్య‌ప‌రంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, విభేదాల‌ను ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం రెండు దేశాల‌కు ఉన్న‌ట్లు చైనా త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ అంశంలో జోక్యం చేసుకునే అవ‌కాశం మూడ‌వ పార్టీకి లేద‌ని చైనా పేర్కొంది. చైనాతో ప్ర‌మాదం ఉంద‌న్న వాద‌న‌ల‌ను ఆపేసి.. మెద‌డు నుంచి ప్ర‌చ్చ‌న్న‌యుద్ధ ఆలోచ‌న‌ల్ని తీసివేయాల‌ని కోరింది. వాస్త‌వాల‌ను గౌర‌వించి, స్థానిక సామ‌ర‌స్య‌త‌కు స‌హ‌క‌రించాల‌ని చైనా అమెరికాను కోరింది.

Tags :

Advertisement