సరిహద్దు వివాదం ద్వైపాక్షిక అంశ౦: చైనా
By: chandrasekar Thu, 29 Oct 2020 6:39 PM
భారత్ సార్వభౌమత్వాన్ని
కాపాడుకునేందుకు చేసే చర్యలకు అమెరికా ఎప్పుడు అండగా నిలుస్తుందని అగ్రదేశ
విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియా టూర్లో
ఉన్న ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ కామెంట్లపై ఇవాళ డ్రాగన్
దేశం చైనా స్పందించింది. సరిహద్దు వివాదం ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో
వాస్తవాలను, నిజాలను అమెరికా గ్రహించాలని చైనా తెలిపింది. చైనా
ఎంబసీ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలు, న్యాయపరమైన
హక్కులపై మూడవ పార్టీ జోక్యం అవసరం లేదని చైనా పేర్కొంది.
భారత్, చైనా మధ్య
సరిహద్దు సమస్య ద్వైపాక్షిక అంశమని, రెండు దేశాలు ఈ అంశంపై చర్చిస్తున్నాయని, సైనికపరంగా, దౌత్యపరంగా
చర్చలు జరుగుతున్నాయని, విభేదాలను పరిష్కరించే సామర్థ్యం రెండు దేశాలకు
ఉన్నట్లు చైనా తన ప్రకటనలో తెలిపింది. ఈ అంశంలో జోక్యం చేసుకునే అవకాశం మూడవ
పార్టీకి లేదని చైనా పేర్కొంది. చైనాతో ప్రమాదం ఉందన్న వాదనలను ఆపేసి.. మెదడు
నుంచి ప్రచ్చన్నయుద్ధ ఆలోచనల్ని తీసివేయాలని కోరింది. వాస్తవాలను గౌరవించి, స్థానిక
సామరస్యతకు సహకరించాలని చైనా అమెరికాను కోరింది.