Advertisement

  • బాచుపల్లిలో ఓ భవన నిర్మాణ సంస్థ జరిపిన పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి.

బాచుపల్లిలో ఓ భవన నిర్మాణ సంస్థ జరిపిన పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి.

By: chandrasekar Fri, 21 Aug 2020 1:42 PM

బాచుపల్లిలో ఓ భవన నిర్మాణ సంస్థ జరిపిన పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి.


హైదరాబాద్‌లో ఓ భవన నిర్మాణం పునాదుల తవ్వకం కోసం బాంబులతో బ్లాస్ట్ చేయగా భారీగా పేలుడు సంభవించినట్టు ఈనాడు పత్రిక కథనాన్ని ప్రచురించింది. బాచుపల్లిలో ఓ భవన నిర్మాణ సంస్థ జరిపిన పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. భారీ బ్లాస్టింగ్‌ వల్ల పెద్ద సైజు బండరాళ్లు చాలా దూరం ఎగిరిపడ్డాయి.

దీంతో స్థానిక చైతన్య కళాశాలలోని 3 బస్సులు, బొలెరో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫర్నీచర్‌ దుకాణంలో సోఫాలు, రోడ్డుపై వెళ్తున్న 2 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమీపంలోని మరో భవనం గోడలు, కిటికీలు సైతం ధ్వంసమయ్యాయి. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండానే భారీ పేలుళ్లు జరిపారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

Tags :

Advertisement