Advertisement

పిల్లల కనుగుడ్లు పీకేసే బ్యాచ్ వచ్చారు...?

By: chandrasekar Thu, 26 Nov 2020 11:26 AM

పిల్లల కనుగుడ్లు పీకేసే బ్యాచ్ వచ్చారు...?


కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఇప్పుడు హల చల్ చేస్తున్న వార్త పిల్లల కనుగుడ్లు పీకేసే బ్యాచ్ వచ్చారని మారుమ్రోగుతుంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పిల్లల కనుగుడ్లు పీకేసే బ్యాచ్ వచ్చారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో తాడికొండ ఎస్ఐ రాజశేఖర్ ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి వేళల్లో కొందరు అపరిచిత వ్యక్తులు వచ్చి పిల్లల కను గుడ్లు పీకేస్తున్నారని, పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారని కొంత మంది వాట్సాప్‌లో, ఫేస్ బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇవన్నీ, వదంతులు, అపోహలు మాత్రమేనని, వీటిని ఎవరూ నమ్మవద్దని ఎస్ఐ రాజశేఖర్ సూచించారు.

ఈ అపోహాలపై గ్రామాల్లో ఎవరైనా అనుమానంగా సంచరించినట్లు అనిపిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని లేదా 100కు డయల్ చేసి తెలియజేయాలని తాడికొండ ఎస్ఐ రాజశేఖర్ సూచించారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనుమానంతో ఎవరిపైనా అఘాయిత్యాలకు పాల్పడవద్దని ప్రజలను ఎస్ఐ రాజశేఖర్ కోరారు. ఎవరిపైనైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. వారిపైన దాడిచేయడం వంటివి చేయకుండా తమకు తెలియజేయాలని వివరించారు.

Tags :

Advertisement